షిరిడి సాయి దేవాలయంలో ఆళ్లకృష్ణ,కృష్ణ వేణి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు
Published: Friday February 19, 2021
మధిర, ఫిబ్రవరి 18, ప్రజాపాలన: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ షిరిడి సాయి దేవాలయంలో మధిర పట్టణానికి చెందిన ఆళ్లకృష్ణ,కృష్ణ వేణి దంపతుల మనవడు, మనవరాలు అచ్యుత్ సాయి, వేదవర్షిణీల పేరు మీద గురువారం నాడు మధిర పట్టణంలోని అభాగ్యులకు ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ షిరిడి సాయి దేవాలయంలో మధిర పట్టణానికి చెందిన ఆళ్లకృష్ణ, కృష్ణ వేణిల దాతల సహకారంతో మధిర పట్టణంలోని అభాగ్యులకు మరియు అనాధలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.srఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: