ఉన్న వారు లేనివారికి సహాయం చేద్దాం

Published: Thursday May 06, 2021
ఆరోగ్యపర్యవేక్షకుడు లంకా కొండయ్య
మధిర, మే 5, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం ఖమ్మం పాడు గ్రామం లొ గత 17 రోజులు నుండి హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్నఒక నిరుపేదవికలాంగురాలుకు భర్తలేని అవిటి కుమారుడు చనిపోయి ఆర్ధిక పరిస్థితి బాగాలేని మహిళా సోదరికి ఖమ్మంపాడు గ్రామవాసి రైతుబిడ్డ శ్రీ మువ్వా ముత్తయ్య గారి కుమారుడు ప్రింట్ మీడియా మిత్రుడు విలేకరి శ్రీ మువ్వా రామకృష్ణ (R K)ఆర్ధిక వితరణతో ఆరోగ్య పర్యవేక్షకుడు మధిర ఆశ మిత్ర సామజిక సేవకుడు లంకా కొండయ్య సలహా మేరకు ఒక నెలకు సరిపడ కిరాణా సరుకులు అందించటం జరిగింది. ఈ సందర్బంగా కొండయ్య, రామకృష్ణలు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్నది. కనుక కష్టకాలంలో బాధ పడుతున్న వారికీ తమ వంతుగా "ఉన్న వారు లేని వారికీ సహాయం చేయటం మహా పుణ్యం" అని వారు తెలిపినారు. కరోనా బాధితులకు సహాయం చేస్తున్న రామకృష్ణ గార్కి లంకా కొండయ్య హృదయ పూర్వక అభినందనలు తెలిపినారు.ఈ కార్యక్రమం లొ ఆరోగ్యసిబ్బంది Anm భారతి Anm నాగమణి ఆశ కార్య కర్త Sk నాగూర్ భీ పాల్గొన్నారు. అదేవిదంగా గ్రామంలొ ఉన్న కరోనా బాధితులను పలకరించి వారి బాగోగులు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.