దుర్గ దేవి నవరాత్రి ఉత్సవాల కరపత్రం విడుదల

Published: Monday September 26, 2022

కోరుట్ల, సెప్టెంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్  మడవేణి నరేష్ ఆధ్వర్యంలో బాలాజీ రోడ్, రామ్ నగర్ లో దుర్గ దేవి నవరాత్రుల ఉత్సవాల కరపత్రం  విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా
అధ్యక్షులు మొరపెళ్లి సత్యనారాయణ, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జేన్ వెంకట్, సునీత,  మాజీ జెడ్పి చెర్మెన్ తుల ఉమ, బీజేపీ సీనియర్ నాయకురాలు అరుణ, సాంబారి ప్రభాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యువ నాయకులు
సురభి నవీన్ కుమార్, కోరుట్ల పట్టణ అధ్యక్షులు చిరుమల్ల ధనంజయ్, రామ్ యువసేన యూత్ బీజేపీ  కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు.