మహాశక్తి ఆలయంలో జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యుల పూజలు ---బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను

Published: Tuesday October 04, 2022

జగిత్యాల, అక్టోబర్ 03 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల ప్రెస్ క్లబ్ 2021 అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో క్లబ్ ప్రతినిధులు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం కరీంనగర్ కు వెళ్లిన పాత్రికేయులు చైతన్యపురిలో గల మహాశక్తి ఆలయంలోని దుర్గదేవి, మహాలక్ష్మి, సరస్వతి అమ్మవార్లను  దర్శించుకోగా గోత్రనామాదులతో అర్చకులు అర్చనచేసి ఆశీర్వదించారు. పాత్రికేయులకు ఇల్లస్థలాలు వచ్చేలా చూడాలని, జర్నలిస్టులకు ప్రభుత్వం అన్నీ విధాలా ఆదుకునేలా చూడాలని అమ్మవార్లను వేడుకున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. ఆలయంలో ఉన్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ధ్యావర సంజీవ రాజు, ప్రతినిధులు ఎన్. జైపాల్, తిరునగరి శ్రీనివాస్, గుర్రం చంద్ర శేఖర్, మెన్నేని రవీందర్ రావు, ఆనంతుల కాంతారావు, రేణికుంట శ్రీనివాస్, మెన్నేని శ్రీనివాస్ రావు, ప్రవీణ్ ఉన్నారు.