టి.ఆర్.ఎస్, ఎం.ఐ.ఎం కుమ్మక్కు రాజకీయాల్లో మరొకసారి బహిర్గతం

Published: Friday February 12, 2021
బాలాపూర్: ప్రజాపాలన; ప్రమాణస్వీకారం చేసిన మేయర్, డిప్యూటీ మేయర్ కూ అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బహిర్గతం. కారుపార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుఅందెల శ్రీరాములు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం, సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్లుగా ప్రమాణస్వీకారం చేసిన రాధాధీరజ్ రెడ్డి, ఆకుల శ్రీవాణి అంజన్ లకు శుభాకాంక్షలు తెలిపారు అందెల. బీజేపీ తరుపున గెలిచి ప్రమాణం చేసిన 47 మందితోపాటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి అభినందనలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై ప్రతీ ఒక్కరూ దృష్టిపెట్టాలని సూచించారు. తమ డివిజన్ల సమస్యలు, అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం బీజేపీ కార్పొరేటర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ ఆకాల మరణం పార్టీకి తీరని లోటని గుర్తుచేసుకున్నారు. నూతన పాలకమండలిలో ఆయన లేకపోవటం బాధాకరమన్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు, దోస్తి మరోసారి బయటపడిందన్నారు. టీఆర్ఎస్ తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.