ఇబ్రహీంపట్నం మే తేది 29 ప్రజాపాలన ప్రతినిధి అబ్దుల్లాపూర్మెట్ నూతన కెవిపిఎస్ మండల కమిటీ

Published: Monday May 30, 2022

అబ్దుల్లాపూర్మెట్ మండలం కెవిపిఎస్ మండల మహాసభ మెట్టు ప్రజాసంఘాల కార్యాలయంలో  జరిగింది. ఈ సమావేశానికి కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి  సామేలు  హాజరై. మాట్లాడుతూ కేంద్రంలో గాని రాష్ట్రంలో  దళితుల మీద దాడులను అరికట్టాలని కుల వివక్షతను రూపుమాపాలని. తెలంగాణ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, దళిత బంధు అర్హులైన దళితులు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు టిఆర్ఎస్ నాయకులు మాత్రమే ఇస్తూ దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధువులందరికీ అంతవరకే కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆందోళనా పోరాటాలు చేస్తామని అన్నారు. అనంతరం మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్ష కార్యదర్శులు గా వారంతా శ్రీనివాస్, బోరెల్లి ధర్మరాజు ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులుగా మల్లయ్య, బిక్షపతి లక్ష్మయ్య, సుధాకర్ శివ కుమార్ , అశోక్ మొత్తం 13 మంది తో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎరుపు నరసింహ, శివ కుమార్ పాల్గొన్నారు.