నాలుగు బార్ షాపులకు 147 దరఖాస్తులు

Published: Friday February 19, 2021
తాండూర్ 2 బార్ షాపులకు 67, పరిగి ఒక బార్ షాపుకు 80 మంది దరఖాస్తు గురువారం నాటి లక్కీ డ్రాలో తాండూరుకు దుబ్బ సతీష్, కల్వ ఉమాశంకర్ లు పరిగికి బర్కత్ పల్లి రాంరెడ్డిలు విజేతలు జిల్లా పాలనాధికారిణి పౌసుమి బసు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి 18 ( ప్రజాపాలన ) : జిల్లాలో 25 జనవరి నుండి 16 ఫిబ్రవరి 2021 వరకు కొత్త బార్ల కేటాయింపు కొరకు దరఖాస్తుల ఆహ్వానాన్ని ఆబ్కారి శాఖ ద్వారా కోరామని జిల్లా పాలాధికారిణి పౌసుమి బసు అన్నారు. తాండూర్ లో 2 బార్ షాపులకు 67, పరిగిలో ఒక బార్ షాప్ కు 80 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆబ్కారి శాఖ ఆధ్వర్యంలో బార్ల కేటాయింపు కొరకు లక్కీ డ్రా అభ్యర్థుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. తాండూర్ కు చెందిన దుబ్బ సతీష్ కుమార్, కల్వ ఉమాశంకర్ లు దక్కించుకొగా, పరిగికి చెందిన బర్కత్పల్లి రామ్ రెడ్డి లు లక్కీ డ్రాలో బార్ షాపులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా మద్య నిషేధ, ఆబ్కారి శాఖ జిల్లా అధికారి వరప్రసాద్ తో పాటు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.