ఘనంగా ఆంజనేయస్వామి 17వ వార్షికోత్సవాలు
Published: Wednesday January 04, 2023
మేడిపల్లి, జనవరి 3 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ గణేష్ నగర్లోని శ్రీ స్వయంభూ సంజీవని ఆంజనేయస్వామి దేవాలయ 17వ వార్షికోత్సవాలను ఆలయ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో మన్యసూక్తసహిత సంక్షేపరామాయణ హోమం, హనుమాన్ మూలమంత్రం మరియు సుదర్శన్ యాగాన్ని వేద పండితులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ కొనాలి అంజిరెడ్డి, వైస్ చైర్మన్ కొండ్ర హనుమంతు, ప్రధాన కార్యదర్శి కొసాల కొండల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి గూడూరి సాయి రెడ్డి, కోశాధికారి చెలమ మోహన్ రెడ్డి, గౌరవ సలహాదారులు గనేట్ శ్రీనివాస్ గౌడ్, సభ్యులు మహంకాళి నరసింహ చారి, పొట్లూరి రమేష్, అప్పిడి జంగారెడ్డి, సత్యనారాయణ, వీరారెడ్డి, గణేష్ నగర్ కాలనీ అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పొట్లూరి వెంకటేష్, ఉప్పల్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు వేముల సంతోష్ రెడ్డి, నిరంజన్, ఆలయపూజారి శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: