దళిత ఆత్మగౌరవ పోరాట ర్యాలీని విజయవంతం చేద్దాం

Published: Tuesday April 26, 2022
దళిత గిరిజన ఐక్యతను చాటుద్దాం-ప్రో. నునావత్ దేవదాస్ నాయక్
జగిత్యాల, ఏప్రిల్ 25 (ప్రజాపాలన): మెట్పల్లి పట్టణంలో ఈ నెల 26న దళిత గిరిజన బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళితుల ఆత్మగౌరవ పోరాట ర్యాలీని విజయవంతం చేయాలని అఖిల భారతీయ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ప్రొఫెసర్ నునావత్ దేవదాస్ నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కార్యాలయంలో దేవదాస్ నాయక్ మాట్లాడుతూ మల్లాపూర్ మండలం నడికూడా గ్రామం మరియు మెట్పల్లి పట్టణంలోని ఆరాపేటలో హనుమాన్  జయంతి ఉత్సవాల సందర్భంగా దళితులను కుల వివక్షతకు గురిచేయడం జరిగిందన్నారు. దళితులను అవమానించిన నిందితులను వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వ తరుపున భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాలకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుకారుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి దళిత గిరిజన సంఘాల పై ఉన్నదని గుర్తు చేశారు.