సింగరేణి కార్మికుల వేజ్ బోర్డు మెంబర్ గా జనక్ ప్రసాద్ ఎంపిక

Published: Monday June 07, 2021

బెల్లంపల్లి, జూన్ 6, ప్రజాపాలన ప్రతినిధి : సింగరేణి కార్మికుల11వ వేజ్ బోర్డు కమిటీలో ప్రతినిధిగా ఐ ఎన్ టి యు సి సీనియర్ నాయకుడు బి.జనక్ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు అఖిలభారత నేషనల్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జి, సంజీవరెడ్డి ఆదివారం నాడు  విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఐ యన్ టి యూసి నాయకుడు టీ, కృష్ణ మోహన్ తదితరులు మాట్లాడుతూ 11వ వేజ్ బోర్డు మెంబర్గా జనక్ప్రసాద్ ను ఎంపిక చేసిన సంజీవరెడ్డికి ఎన్నికైన జనక్ ప్రసాద్ గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు.