ఫ్లెక్సీ ప్రింటర్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Published: Tuesday October 04, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 3 ప్రజాపాలన ప్రతినిధి: దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా జీవించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
సోమవారం నియోజకవర్గం లోని మాల గురిజాల గ్రామంలో దళిత బంధు పథకంలో భాగంగా, కలాలి శ్రావణ్ కుమార్ కు మంజూరైన ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపును ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షులు టి, సత్యనారాయణ , బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ , ఉపాధ్యక్షురాలు రాణి-సురేశ్ , కన్నెపల్లి, కాసిపేట జడ్పీటీసీలు సత్యనారాయణ , చంద్రయ్య , బెల్లంపల్లి, నెన్నెల,  కాసిపేట మండలాల తెరాస పార్టీ నాయకులు బీమా గౌడ్, గణేష్ గౌడ్ , సాగర్ గౌడ్ , రమణారెడ్డి,  భీమయ్య ,  ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.