ఎస్సారెస్పీ స్థలంలో అక్రమ షెడ్డు నిర్మాణానికి అడ్డగింత

Published: Wednesday March 01, 2023

శంకరపట్నం ఫిబ్రవరి 28 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో ఎస్సారెస్పీకి చెందిన స్థలంలో ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి షెడ్డు నిర్మాణం చేపట్టగా మంగళవారం గ్రామస్తులు  అడ్డుకున్నారు. అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడగా కేశవపట్నం పోలీస్ శాఖ పిసి కుమార్ ఘర్షణను సద్దుమణిగేలా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికైనా ఎస్సారెస్పీ అధికారులు వెంటనే అక్రమ నిర్మాణాన్ని అక్కడ నుంచి పూర్తిగా తొలగించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు బొజ్జ నాంపల్లి, రాజయ్య, మెరుగు రాజు, బొజ్జ రవి, బొజ్జ లింగయ్య, రమేష్, సమ్మయ్య, మెరుగు నారాయణ, బొజ్జ సంపత్, తదితర గ్రామస్తులు ఈ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారు.