అనాధ అభాగ్యులకు విశేష అన్నదానం

Published: Tuesday August 03, 2021
బాలాపూర్: ఆగస్టు 02, ప్రజాపాలన ప్రతినిధి : కార్పొరేషన్ మేయర్ జన్మదినాన్నీ పురస్కరించుకొని సి సి ఎన్ ఆర్  ఫౌండేషన్ తరఫున అనాధాశ్రమం లో విశష అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం లోని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను సి పి ఎన్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దయాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో నాదర్గుల్ గ్రామంలో ఉన్నటువంటి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం సోమవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ..... ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందిని అన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలను ఆమె మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. సహకరించిన ఫౌండేషన్ సభ్యులకు, ఆశ్రమ నిర్వాహకులు గట్టు గిరి, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలక్రిష్ణ గౌడ్, రియాజ్, భరత్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.