రైతు బీమా చెక్కును అందించిన తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

Published: Tuesday March 30, 2021
వెల్గటూర్, మార్చి 29, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన అసాది శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించగా వారికి రైతు భీమ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన అయిన ఐదు లక్షల రూపాయల చెక్కును సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా భార్య లక్ష్మికి అందించారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ ఎం.పీ.పీ కునమల్ల లక్ష్మి లిగయ్య, కొత్త పేట మాజీ ఎం.పి.టి.సి కోడి గంగయ్య గారు పాల్గొన్నారు. ఆది శ్రీనివాస్ భార్య లక్ష్మి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.