మంచిర్యాల జిల్లా కలెక్టర్ మైనార్టీలను పట్టించుకోవడం లేదు. ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఇమ్రోజ్ .

Published: Wednesday September 21, 2022
 బెల్లంపల్లి సెప్టెంబర్ 20 ప్రజా పాలన ప్రతినిధి:
 
 మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీ కేరి ముస్లిం మైనార్టీల సమస్యలపై పట్టించుకోవడంలేదని బెల్లంపల్లి పట్టణ ఎంఐఎం అధ్యక్షుడు ఇమ్రోజ్ ఆరోపించారు.
మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాపూర్ లో మసీదు నిర్మాణం కోసం ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మైనొద్దిన్  14 లక్షల 9 వేల రూపాయలు మంజూరు చేయగా మజీద్ నిర్మాణం కోసం ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా జిల్లా కలెక్టర్ పట్టించుకోవడంలేదని అన్నారు.జిల్లా కలెక్టర్ మైనార్టీలపై చిన్న చూపు చూస్తుందని ఆయన అన్నారు.
అలాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మైనారిటీ కమ్యూనిటీ హాల్ కోసం 79 లక్షలు సాంక్షన్ చేసిన అది పూర్తిచేసే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. 
రానున్న రోజుల్లో బెల్లంపల్లిలో గాని మంచిర్యాలలో గాని మున్సిపాలిటీకి మైనార్టీ చైర్మన్గా అవకాశం కల్పించాలని లేనిచో దానికి జరగబోయే పరిణామాలకు జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని   హెచ్చరించారు. మంచిర్యాల కలెక్టర్ కాంప్లెక్స్ లో మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేయాలని ఎక్కడో మారుమూలన ఏర్పాటు  చేయడం సరైంది కాదని ఆయన అన్నారు.
 
 
 
Attachments area