*ప్రశ్నించే హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు* *అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు* -పీడీ ఎస

Published: Thursday February 23, 2023

చేవెల్ల ఫిబ్రవరి 22 (ప్రజాపాలన):-

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల  నియోజవర్గం షాబాద్ మండలంలోని చందన నపల్లి హైతబాద్ గ్రామాలలో *వెల్స్ పాన్* కంపెనీలో కొత్త యూనిట్ నీ ప్రారంభించడానికి వస్తున్న మంత్రి కేటీఆర్ ని విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమకారులు,  అడ్డుకుంటారనే భయంతో పోలీసులు  ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU )  రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ ని చేవెళ్ల పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం చేయగా,
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ
విద్యార్థి సంఘాలకు భయపడి ఇలా ముందస్తు అరెస్టులు చేసి మంత్రి కేటీఆర్ ఎన్ని రోజులు కార్యక్రమాలు చేస్తారని, ఉన్న సమస్యలను పరిష్కరిస్తే ఈ భయం మంత్రి కేటీఆర్ కు ఉండేది కాదు కదా అని అన్నారు.
ఇది అరాచకమైన  రాచరిక పాలనలా ఉంది. ఈ వ్యవస్థ తీరు ఇది ప్రజాస్వామ్య దేశం కదా ? ప్రశ్నించే హక్కుని కాలరాస్తున్నా *ఈ రాష్ట్రంలో రాక్షసుల పాలనా రాజ్యమేలుతుంది.* ఇంత పిరికి తనంతో అధికారం ఎందుకు చేపట్టాలి ?

ప్రజల సొమ్ముని దోచుకు తినేవారే ఇలా భయపడుతూ రాజ్యాన్నీ పాలిస్తారు. అయినా అవినీతి మంత్రులను, అడ్డుకోవాలి అని ప్రశ్నించే గొంతుక అనుకుంటే ఎంత సేపు,, ఎలాగైనా అడ్డుకుంటుంది.

వారిని ఆపడం ఎవ్వరి తరం కాదు  కాబట్టి ఇప్పటికైనా ఈ ముందస్తు అరెస్ట్ లు చేయడం మానుకోవాలి.

*రాష్ట్రంలోని విద్యారంగా సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని పరిషరించండి.  చేవెళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం  2014లో  ప్రారంభిస్తే ఇప్పటివరకు పూర్తి కాకపోవడం సిగ్గుచేటు*

*ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరం లోపల  ప్రగతిభవన్ కట్టడం పూర్తయింది. కానీ  పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ డిగ్రీ కళాశాల  నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాలేదు*
శంకరపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలి
అని అలాగే
హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా  మెస్  చార్జీలు పెంచాలని అన్నారు. బస్సుల సమస్యను కూడా పరిష్కరించాలని. అదేవిదంగా పెండింగ్ లో ఉన్న 3500 కోట్ల  ఫీజురియంబర్స్మెంట్ &స్కాలర్షిప్ ని వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU )రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ డిమాండ్ చేయడం జరిగింది.