తల్లాడ మండలం నుండి భారీగా తరలి వెళ్లాలి.. బీజేపీ మండల అధ్యక్షులు ఆపతి రామారావు..

Published: Friday July 01, 2022
తల్లాడ, జూన్ 30 (ప్రజాపాలన న్యూస్):  హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జులై 3న జరిగే విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలని బిజెపి పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు ఆపతీ వెంకట రామారావు పిలుపునిచ్చారు. గురువారం తల్లాడలో ఆయన మాట్లాడుతూ సభకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనే ఈ సభకు తల్లాడ మండలం నుండి కూడా అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. దానిలో భాగంగా 1న అన్నారుగూడెం గ్రామానికి పశ్చిమబెంగాల్ రామ్ గట్టు నియోజకవర్గ శాసనసభ్యులు ముక్తిముని అధికారి విచ్చేయుచున్నారన్నారు. గ్రామంలోని రైతులతో ముఖాముఖి చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కోపరేటివ్ సెల్ అధ్యక్షులు బాలాజీ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి గాదే కృష్ణారావు, మండల కార్యదర్శి తొండపు మధు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వాడవల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.