మధిరలో బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభం.

Published: Saturday February 04, 2023
మధిర రూరల్ ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయన్ని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి,మాజీ మంత్రి, రవీందర్ నాయక్, మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు,గెల్లా సత్యనారాయణ ప్రారంభించటం జరిగింది,
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు, బీజేపీ ని తెలంగాణ లోఅవినీతి, కుటుంబ పాలన, అంతం చేసి బీజేపీ ని అధికారంలోకి తీసుకురావటం కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పని చేయాలన్నీ,మధిర నియోజకవర్గం లో బీజేపీ ని బలోపేతం చేస్తూ మధిరలో బీజేపీ గెలుపు కోసం, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న అధికారాపార్టీ తరుపున జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్న, మధిరలో, అభివృద్ధి మాత్రం జరగటం లేదు,దీన్ని ప్రజల్లో కి తీసుకువెళ్లి, టిఆర్ఎస్ కాంగ్రెస్ చీకటి స్నేహాన్ని ప్రజల్లోకి తీసుకోని వెళ్లాలాన్ని, కార్యకర్తలు కు చూచించటం జరిగింది,పట్టణమరియుమండల్,అధ్యక్షులు పాపట్ల రమేష్,గుండా చంద్రశేఖర్ రెడ్డి,అధ్యర్యంలో జరిగిన,
ఈ కార్యక్రమం లో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరావు, దళిత మోర్చా, రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళపల్లి విజయరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు,జిల్లా అధికారప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరావు,దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు, కోటమర్తి సుదర్శన్, బిపినాయక్,వేణుగోపాల్ రెడ్డి, దేవరకొండ కోటేశ్వరరావు, కుంచం కృష్ణారావు,కొమ్మినేని సుధాకర్, ముక్కపాటి శ్రీను, విరపనేని అప్పారావు, మోహనరావు, రాము, జయపాల్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.