మత్స్యకారుల ఇంట రొయ్యల పంట : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Wednesday December 08, 2021
వికారాబాద్ బ్యూరో 07 డిసెంబర్ ప్రజాపాలన : మత్స్యకారుల ఇంట రొయ్యల పంట అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని నంది వాగు చెరువులో మంచి నీటి రొయ్య పిల్లల ను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోమిన్ పేట్ నంది వాగు చెరువులో 96వేల మంచి నీటి రొయ్య పిల్లలను వదిలామన్నారు. మార్కెట్ లో రొయ్యలకు మంచి డిమాండ్ ఉందని మత్స్యకారులు ఆర్థికంగా మరింత నిలదొక్కుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రభుత్వం కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.