పిహెచ్సి ని సందర్శించిన జాతీయ స్థాయి వైద్య బృందం

Published: Saturday December 24, 2022

బోనకల్, డిసెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: జాతీయ నాణ్యత ప్రమాణాల స్థాయి వైద్య బృందం శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. బృందం సభ్యులు డాక్టర్ సందీప్ శర్మ, డాక్టర్ తులసి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలు, రోగుల విభాగాలు, ల్యాబ్ ఫార్మసీ లేబర్ రూమ్ పరిశీలించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, ఎన్ బాలకృష్ణ లతో సమావేశమై వివరాలు సేకరించి రికార్డ్స్ పరిశీలించారు. వైద్య బృందం ఇచ్చిన సమాచారంతో సంతృప్తిని వ్యక్తపరిచారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం లు, సూపర్వైజర్లతో సమావేశమై ప్రజలకు అందుతున్న సేవలను తెలుసుకోనీ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కోఆర్డినేటర్ నీలోహన, జిల్లా క్వాలిటీ మేనేజర్ ఉపేందర్, సిహెచ్ఓ పి శ్రీనివాసరావు, ఆర్ బి ఎస్ కే డాక్టర్స్ శ్రీకాంత్, నిరోషా, డిపిఎమ్ఓ భద్రం, ఎస్ టి ఎస్ సందీప్, ఎస్ టి ఎల్ ఎఫ్ శివ, ఆప్తమ లిఫ్ట్ ప్రవీణ్, స్టాఫ్ నర్స్ భవాని, ఫార్మసిస్ట్ రాథాలత, స్వర్ణమార్తా, రాజ్యలక్ష్మి, యాకూబ్, నాగరాజు, హెల్త్ సూపర్వైజర్ దానయ్య, డీఈఓ నాగేశ్వరరావు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పల్లె దవాఖాన డాక్టర్లు పాల్గొన్నారు.