ఇటిక్యాల గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏది?

Published: Tuesday July 05, 2022
ఎంపీడీవో కు ఫిర్యాదు చేసిన వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు
 
 రాయికల్, జూలై 4 ( ప్రజా పాలన ప్రతినిధి ):
 రాయికల్ మండలంలో అతిపెద్ద గ్రామపంచాయతీ అయిన ఇటిక్యాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడంతో సోమవారం జగిత్యాల జిల్లా వార్డ్ మెంబర్స్ ఫోరం అధ్యక్షులు ఏలేటి జలంధర్ రెడ్డి రాయికల్ మండల్ ఎంపీడీవో కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటిక్యాల గ్రామంలో ఇప్పటివరకు పల్లె ప్రకృతి వనం నిర్వహించకపోవడంతో స్థానిక సర్పంచ్ ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో ఎంపీడీవో కు ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్ని సార్లు చెప్పిన స్థానిక సర్పంచ్ పెడచెవిన పెట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని గ్రామంలో పల్లె ప్రకృతి వనం  ఏర్పాటు చేయాలని కోరారు.