మన్నేగూడ ఎంపిటిసి ఆదిల్ సేవలకు జాతీయ సేవారత్న అవార్డు

Published: Tuesday March 14, 2023
* బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ 
వికారాబాద్ బ్యూరో 13 మార్చి ప్రజాపాలన : సామాజిక సేవా కార్యక్రమాలలో విద్య వైద్యం ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసే వారికి బహుజన సాహిత్య అకాడమీ సేవారాత్మ అవార్డు అందజేస్తామని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ సేవలను గుర్తించి జాతీయ సేవా రత్న అవార్డును ప్రజా యుద్ద నౌక గద్దర్ బహూకరించారు. ఆదివారం అంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో నిర్వహించిన బహుజన రైటర్స్ 6వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ లో ఈ అవార్డు ను మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ సేవలను గుర్తించి జాతీయ సేవా రత్న అవార్డును ప్రజా యుద్ద నౌక గద్దర్, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ సంయుక్తంగా అందజేశారు. ఈ సందర్భంగా మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ మాట్లాడుతూ ఈ అవార్డు రావడానికి కృషిచేసిన, సామాజిక సేవలో పాలుపంచుకున్న నా స్నేహితులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి మన్నెగూడ ప్రజలకు వికారాబాద్ జిల్లా ప్రజలకు, మైనార్టీ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయి రాష్ట్రస్థాయి నేతలు వికారాబాద్ జిల్లా మన్నెగూడ ఆదిల్ అన్న టీమ్ సభ్యులు పాల్గొన్నారు.