దళిత బంధుపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే
Published: Wednesday December 28, 2022
జన్నారం, డిసెంబర్ 27, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతాగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన దళిత బంధు అవగాహన సదస్సు కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పాల్గొన్నారు. మంగళవారం మండలంలోని చింతగూడ గ్రామంలో దళిత బంధు పథకం గురించి స్థానిక గ్రామ ఎస్ సి కులాల వారికి ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీపతి పద్మ, వైస్ చైర్మన్ గొట్ల రాజేష్, మండల కోఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీ ఖాన్, పిఎసిఎస్ చైర్మన్ రమేష్, ఎంపీపీ వైస్ చైర్మన్ సుతారి వినయ్ కుమార్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జాడి గంగాధర్, భరత్ కుమార్, ముత్యం సతీష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: