దాతల సహకారం అభినందనీయం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, మధిర జూలై రూరల్ 27 ప్రజా పాలన ప్ర

Published: Thursday July 28, 2022

ప్రాథమికోన్నత పాఠశాల ఖమ్మంపాడు* విద్యార్థులకు ఈ రోజు పాఠశాల ఆవరణలో దాతల సహకారం తో బ్యాగులు,నోట్ బుక్స్ ను కార్యక్రమ *ముఖ్య అతిధి లింగాల.కమలరాజు* చేతుల మీద అందజేయడం జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.కె.నాగులు మీరా అధ్యక్షత న జరిగిన కార్యక్రమం లో కమలరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న పేద విద్యార్థులకు *65,000 రూ విలువ చేసే నోట్ బుక్స్,బ్యాగులు* ఉచితంగా అందించడానికి ముందుకొచ్చిన దాతలు *మువ్వ.కోటేశ్వరరావు,పారుపల్లి.వెంకటేశ్వరవు,సామినేని సాంబశివరావు* గార్లకు అభినందనలుతెలియజేస్తున్నానని,భవిష్యత్ లో పాఠశాలకు మరింతగా చేయూతను అందించాలని పేర్కొన్నారు.*పాఠశాల ఉపాధ్యాయ బృందం కృషితో 150 మందికి పై గా విద్యార్థులతో పాఠశాల నడవడం హర్షించదగిన పరిణామమని*,మన ఊరు మన బడి లో సెలెక్ట్ అయినందున ప్రభుత్వం నుండి వొచ్చే నిధులను సాధ్యమైనంత తొందరగా రావడానికి కృషిచేస్తానని తెలిపారు. చైర్మన్,అతిధుల చేతిమీదగా దాతలను శాలువలతో సత్కరించారు.కార్యక్రమం లో మధిర ఎంపీపీ మొండెం.లలిత , మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు.నాగేశ్వర రావు, డిసిసి బి వైస్ చైర్మన్ దొండపాట వెంకటేశ్వరరావు ,గ్రామసర్పంచ్.దొండపాటి.రుక్మిణమ్మ,. ఎంపీటీసీ సురేష్ , టిఆర్ఎస్ మండల నాయకులు బొగ్గుల.భాస్కర రెడ్డి,నాయకులు ఉమా మహేశ్వరరెడ్డి పిడికిటి.సాంబశివరావు,దిరి శాల. రాము,దాతలుమువ్వా.కోటేశ్వరరావు,సామినేని,సాంబశివరావు,పారుపల్లి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు కృష్ణా రెడ్డి,మదార్,బ్రహ్మారెడ్డి,శ్రీనివాసరావు,సునీత,జ్యోతి,తడితరులు పాల్గొన్నారు