పేదలపాలిటి పెన్నిధి డాక్టర్ అనిల్ కుమార్

Published: Monday January 10, 2022
ఎర్రుపాలెం డిసెంబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి: ఎర్రుపాలెం ఎస్సీ కాలనీలో డెంగ్యూ, వైరల్ విష జ్వరాలతో ప్రజలు సతమతమైతూ దిక్కుతోచని పరిస్థితుల్లో మధిర నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ నేనున్నా అంటూ అభయమిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి ఎంతోమందిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడినందుకు ఎర్రుపాలెం ఎస్సీ కాలనీ కి చెందిన యువత ఆదివారం డాక్టర్ అనిల్ కుమార్ కు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ పేదలకు వైద్యం అందించటానికి ఎల్లప్పుడూ అందరికీ సహకరిస్తానని ఈ విధంగా సన్మానం చేయటం నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ కోటేశ్వరరావు, నండ్రు అజిత్ కుమార్, రాజీవ్ గాంధీ, దేవరకొండ చిరంజీవి, గుడేటి బాబు, గుడేటి యోబు, ఎర్రుపాలెం ఎస్సీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.