శిధిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చిన మున్సిపల్ కమిషనర్ సుచరిత
Published: Wednesday September 29, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపల్ పరిధి మంగల్ పల్లి గ్రామంలో శిధిలావస్థకు చేరుకున్న ఇళ్లను పరిశీలించిన ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ సుచరిత. శిధిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించి నేలమట్టం చేయడం జరిగింది. ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులను కమ్యూనిటీ హాల్ కు తరలించి కుండపోత వర్షాలు కురుస్తున్న నందున గ్రామంలోని 4 ఇండ్లను పరిశీలించి పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్న ఒక గృహాన్ని కూల్చివేయడం జరిగింది. ఆదిభట్ల నుండి కొంగరకలాన్ వెళ్లే దారిలో వరద తాకిడితో రోడ్డు అస్తవ్యస్తత కావడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో రోడ్డు ను పరిశీలించి మట్టి పోయించి చదును చేయడం జరిగింది. అనంతరం కొన్ని వ్యాపార సముదాయాలకు అనుమతులు లేవని పరిశీలనకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే రెడ్ మిక్స్ పరిశ్రమను పరిశీలించి వాటికి సరైన అనుమతులు లేవని నిర్ధారించి జరుగుతున్న పనులను నిలిపి వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్ సుచరిత వెంట మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: