ఓటమి భయంతోనే టిఆర్ఎస్ దాడులు ** రాష్ట్రీయ రహదారిపై బిజెపి రాస్తారోకో **

Published: Wednesday November 02, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 01 (ప్రజాపాలన, ప్రతినిధి) : మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతాడననే భయంతో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై టిఆర్ఎస్ పార్టీ గుండాలు దాడులు చేస్తున్నారని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నాక విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై చేసిన దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని రాష్ట్రీయ రహదారిపై బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోతుందన్న ఆక్రోషంలో బిజెపి నాయకులు, కార్యకర్తలపై, దాడులు చేస్తున్నారని ఎన్నికల్లో టిఆర్ఎస్ ఏన్ని కుట్రలు చేసిన ప్రజలు బిజెపికే పట్టం కడతారని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మురళి, శ్రవణ్ గౌడ్,సత్యనారాయణ, కార్తీక్,తిరుపతి, వెంకన్న,నాయకులు పాల్గొన్నారు.