నారాజన్ రెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరు అందించి రైతులను ఆదుకోవాలి. .....తాళ్ళపెల్లి రాజేశ్వర్

Published: Wednesday December 28, 2022

జన్నారం, డిసెంబర్ 27, ప్రజాపాలన: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నారాయణరెడ్డి ప్రాజెక్టు కింది రైతులైన జన్నారం, దండేపల్లి, లక్షేట్టిపేట్, హాజీపూర్, మండలాల రైతులకు రెండో పంటకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని మంగళవారం తెలుగుదేశం పార్టీ అదిలాబాద్ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జన్నారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కడెం ఆయకట్టు కింద జన్నారం దండేపల్లి లక్షేట్టిపేట్ హాజీపూర్ మండలాల రైతులకు నీరు అందించాలన్నారు. మొదటి పంటలో అధిక వర్షాలు పడి పంటలు పూర్తిస్థాయిలో పండలేదని ఆయన తెలియజేశారు. నారాయణరెడ్డి ప్రాజెక్టులో యాసంగీకి సరిపడా నీరు ఆయకట్టులో ఉన్నందున రెండో పంటకు నీరు అందించి రైతులకు న్యాయం చేయాలన్నారు. మొదటి పంట సాగులో అధిక వర్షాలు పడి పంటలు సక్రమంగా పండలేదని తెలిపారు. కడెం ఆయకట్టు నుంచి రెండో పంటకు నీరు అందిస్తూ రైతులు ఆదుకోవాలని ఆయన కోరారు.