తెలంగాణ రైతు సంఘం ద్వితీయ మహాసభలను జయప్రదం చేయండి బాగం నరసింహారావు

Published: Tuesday June 21, 2022
పాలేరు జూన్ 20 ప్రజా పాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నేలకొండపల్లి లోని కర్నాటి క్రిష్ణయ్య భవన్ లో నేలకొండపల్లి మండల తెలంగాణ రైతు సంఘం కార్యవర్గ సమావేశం మచ్చా రఘుపతిరావు అద్యక్షతన జరిగినది. ఈమావేశంలో రైతు సంఘం నేలకొండపల్లి మండల కార్యదర్శి బాగం నరసింహారావు మాట్లాడుతూ జులై 1 న హుజుర్ నగర్ లో జరిగే రైతు సంఘం బహిరంగ సభలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈకార్యక్రమంలో నేలకొండపల్లి మండల సిపిఐ కార్యదర్శి కర్నాటి బానుప్రసాద్, రైతు సంఘం జిల్లా నాయకుడు కనకబండి శీతరాములు, నేలకొండపల్లి మండల రైతు సంఘం నాయకులు చావా గణపతిరావు,మాలోతు అయోధ్య,రాయల మాధవరావు,సిర్రా ప్రసాద్, భూక్యా వెంకటేశ్వరరావు, నేలకొండపల్లి సిపిఐ గ్రామ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.