అయ్యోధ్య శ్రీ భవ్య రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ
Published: Friday February 12, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన : అయ్యోధ్య శ్రీ భవ్య రామమందిర నిర్మాణ జనజాగరణలో భాగంగా బిజేపి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకిందిగోవర్ధన్ గౌడ్ ఆద్వర్యంలో శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయవాది, అక్షిత కన్ స్ట్రక్షన్స్ అధినేత తునికి రాఘవేందర్ రావు రూ. 1,01,116 నిధి సమర్పణ చేశారు. జిల్లాపరిషత్ మాజీ వైస్చైర్మెన్ నందకుమార్ యాదవ్, ఆర్ ఎస్ ఎస్ భాగ్ సహ కార్యావహ్ యాదగిరి, బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, నాయకులు అందెల కుమార్యాదవ్, రామసేవకులు పుట్ట వినయకుమార్ లకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రావు మాట్లాడుతూ రామ జన్మభూమి అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం ప్రతీ ఒక్క హిందువు కల అన్నారు. రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ముందుకు వస్తున్నారన్నారు. మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం రామసేవకులు ప్రముఖ ఎక్సైజ్ కాంట్రాక్టర్, మియాపూర్ వాస్తవ్యులు రాచమళ్ల ఓం ప్రకాష్గౌడ్ను కలిశారు. ఈ సందర్భంగా మందిర నిర్మాణ ప్రాధాన్యత, ప్రణాళికను ఆయనకు వివరించారు. స్పందించిన ఓం ప్రకాష్గౌడ్ రామమందిర నిర్మాణ నిధి సమర్పణలో తనవంతుగా రూ.50 వేల చెక్కును అందజేశారు. రామకార్యంలో భాగస్వామ్యులయిన తునికి రాఘవేందర్ రావు, ఓంప్రకాష్గౌడ్ లకు గోవర్ధన్ గౌడ్ బృందం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ సేవకులు పుట్ట వినయకుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్గౌడ్, యాదగిరిగౌడ్, కరుణాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: