హోమియో హాస్పిటల్ వాలంటీర్లకు సన్మానం

Published: Monday February 08, 2021
శ్రీమతి కుందా సావిత్రి హోమియో హాస్పిటల్ మధిర నందు సెలవు రోజైనప్పటికి ప్రతి ఆదివారం హాస్పిటల్ కి వచ్చే పేషెంట్స్ కి సర్వీస్ అందిస్తున్న వాలంటీర్స్ అందరిని హాస్పిటల్ వ్యవస్థాపకులు *శ్రీ కుందా కోటేశ్వరరావు గారు వారి కుమారులు శ్రీ కుందా నాగభూషణంగారు* ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుందా కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ *"మానవ సేవే మాధవ సేవ"* గా పేర్కొంటూ పేద ప్రజలందరికి దీర్ఘకాలిక రోగాలను నయం చేయడానికి ఈ హోమియో హాస్పిటల్ నిర్మించడం జరిగిందని అందరు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.