(ప్రజా పాలన)
Published: Thursday October 20, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలో ప్రభాకర్ అనే వ్యక్తి 28క్వింటాల రేషన్( PDS) బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా బూర్గంపాడు పోలీసులకు సమాచారం అందడంతో వారు పిడిఎస్ రేషన్ బియ్యం దొంగలని.
పట్టుకున్నారు. ఈ పట్టుకున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు, మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అప్పగించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా పేదల బియ్యాన్ని పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిలువచేసిన, పేదల నుంచి దొంగలించి వేరే ఎక్కడికైనా తరలించే ప్రయత్నం చేసిన వారికి కఠినమైన శిక్షలు పడతాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
Share this on your social network: