భిక్షం నాయక్ విగ్రహావిష్కరణ హజరైన లక్ష్మణ్ నాయక్
Published: Wednesday June 08, 2022
పాలేరు జూన్ 7 ప్రజాపాలన ప్రతినిధి
పాలేరు నియోజకవర్గం, కూసుమంచి మండలం మల్లాయిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ స్వర్గీయ భిక్షం నాయక్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి స్వస్థలం హట్యా తండ నందు ఏర్పాటు చేసిన విగ్రహవిష్కరణ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా తెరాస సీనియర్ నాయకులు బాదావత్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భిక్షం నాయక్ ఒక రాజకీయ నాయకుడిగా, సంఘ సంస్కర్తగా ఈ సమాజానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. కూసుమంచి మండలంలో స్థానికంగా ప్రతి ఒక్కరిని పేరు పేరునా నవ్వుతూ పలకరించేవారని ఈ సందర్భంగా వారు భిక్షం నాయక్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెరాస యువజన నాయకులు భుక్యా రఘు నాయక్, కందాల వీరబాబు, ధరావత్ సురేష్ నాయక్, బాదావత్ వెంకన్న నాయక్, భుక్యా మంజిలాల్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: