ఎమ్మెల్సీ కరోనా నుండి కోలుకొని ప్రజాసేవలోకి రావాలని పూజలు...
Published: Thursday July 15, 2021
జగిత్యాల, జులై 14 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని మాడేలేశ్వర స్వామి ఆలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి కరోనా పాజిటివ్ నుండి తొందరగా కోలుకోవాలని యధావిధిగా ప్రజాసేవలోకి రావాలని భగవంతుడుని కోరుకుంటూ గాంధీనగర్ గణేష్ నగర్ చింతకుంట వార్డ్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నక్క జీవన్ అల్లాల రమేష్ రావ్ గాజుల రాజేందర్ బొల్లారపు గిరిధర్ బడుగు రాజేందర్ నక్క రాజయ్య నీలం పెద్దలు రవి రాము లక్ష్మణ్ మైసయ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: