అనారోగ్యంతో విఆర్ఏ కూతురు మృతి

Published: Friday September 16, 2022

జన్నారం, సెప్టెంబర్ 15, ప్రజాపాలన:

 

మండలంలోని పుట్టిగూడ గ్రానికి చెందిన సహాస్ర (09) అనే బాలిక విష జ్వరం తో బాధపడుతూ గురువారం మృతి చెందింది. మృతురాలు తండ్రి సాగర్ తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన చిన్నారి బాదంపెల్లి గ్రామంలో ని ప్రభుత్వ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతుంది. అమెకు జ్వరం రావడంతో మండలకేంద్రంలో ని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఐతె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. మృతురాలి తండ్రి అదేగ్రామంలో విఆర్ఏ గా విధులు నిర్వహిస్తున్నారు.ఐతే ఈమధ్య కాలంలో విఆర్ఏ లు సమ్మె లో ఉండటం వలన చేతిలో చిల్లి గవ్వలేక ఇబ్బందులు పడుతున్నా నేపథ్యంలో చిన్నారి కి సరైన సమయంలో చికిత్స అందించలేక పోయారు. ఈ క్రమంలో బాలికను కోల్పోయిన దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించగా ఈ సంఘటన పలువురు ను కంటతడి పెట్టించింది.