బతుకమ్మ ఘాట్స్ ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ గలిపెల్లి స్వరూప రాణి
Published: Saturday October 09, 2021
జగిత్యాల, అక్టోబర్ 08 (ప్రజాపాలన ప్రతినిధి): బతుకమ్మ ఘాట్స్, బతుకమ్మ ఏర్పాట్లు, పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ గలిపెల్లి స్వరూప రాణి పర్యవేక్షించినారు. వాణి నగర్ కెనాల్ వెంబడి గల బతుకమ్మ ఘాట్స్ ఏర్పాట్ల పనులను పర్యవేక్షించి, మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఘాట్స్ వద్ద, వార్డుల యందు ఏర్పాట్లు చేయుటకు ఏ.ఈలకు, సానిటరీ ఇన్స్పెక్టర్ ఆదేశించడం జరిగినది. అంగడి బజార్ యందు రోడ్డు పై చెత్త వేసిన దుకాణ దారులకు మూడు షాపులకు రూ.లు 7000.00 జరిమానా విధించడం జరిగినది. దుకాణ దారులు రోడ్డుపై చెత్త వేయవద్దని మున్సిపల్ వాహనమునకే అంధించాలని తెలిపారు. కమిషనర్ వెంట ఏ.ఈ ఆయుబ్ ఖాన్, సానిటరి ఇన్స్పెక్టర్ అశోక్, రాము మరియు సిబ్బంది ఉన్నారు.
Share this on your social network: