అభివృద్ధిలో మధిరను అగ్రగామిగా నిలుపుతా!జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Wednesday November 23, 2022

మధిర రూరల్ నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతిని ధి) మధిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని  ఇల్లూరు,వంగవీడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలను, గుర్తించి,అవి పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.  టిఆర్ఎస్ ప్రభుత్వం మధిర నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేసిందిన్నారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, అంతర్గత సిసి రహదారులు, నిర్మించటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు లాంటి అనేక పథకాలు ఇతర రాష్ట్రాల్లో సైతం అమలు చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి ఎంపీపీ మెండెం లలిత మాజీ మార్కెట్ కమిటీ కమిటీ  చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరావు మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, చావా వేణు తాళ్లూరి హరీష్ బాబు కూనా నరేందర్ రెడ్డి అబ్బూరి రామన్ జల్లేపల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు.