శ్రీరామనవమి సందర్భంగా మాటూరు గ్రామాల్లో భారీ అన్నదానం
Published: Monday April 11, 2022
మధిర ఏప్రిల్ 10 ప్రజాపాలన ప్రతినిధి : మండలం పరిధిలో మాటూరు గ్రామంలో ఆదివారం నాడు శ్రీరామనవమి సందర్భంగా భారీ అన్నదానం జరిగినట్లు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుశీలశీల ద్యాసంస్థల కరస్పాండెంట్ బూస కోటేశ్వరరావు దంపతులు హాజరైమాటూరు గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుశీల విద్యాసంస్థల కరస్పాండెంట్ బూస కోటేశ్వరావు వారి సతీమణితో కలిసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించినారు ఈ సందర్భంగా. బూస కోటేశ్వరావు మాట్లాడుతూ గ్రామస్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరాములు వారి కృపాకటాక్షాలు మీ అందరిపై ఉండాలని రాములు వారి చల్లని దీవెనలు తో ప్రతి ఒక్కరి సర్వ విఘ్నాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా పూర్తిగా భగవంతుని కోరుకుంటూనాను. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో బోర్ర రామ్మూర్తి కొలా కృష్ణమూర్తి యమ్ వి కృష్ణారావు యమ్ కృష్ణ, శ్రీనివాసరావు మేడిశెట్టి శ్రీహరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: