బీజేపీ అధ్వర్యంలో ఘనంగా ఏడోవ అంతర్జాతీయ యోగా దినోత్సవం

Published: Tuesday June 22, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : 7వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి 106 డివిజన్ బీజేపీ అధ్వర్యంలో యోగ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి యోగ శిక్షకులు పుట్ట వినయ్ కుమార్ విచ్చేసి యోగ అభ్యసనం చేయించడం జరిగింది. ప్రపంచానికి యోగని పరిచయం చేసిన ఘనత మన భారత దేశానిది అని, ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు యోగని అభ్యసిస్తున్నాయని, ప్రతిరోజూ యోగ చేయడం వల్ల మానసిక, శారీరిక ఉల్లాసం, ఆరోగ్యం చేకూరుతాయని, యోగతో పాటు సరైన భోజన, నిద్ర నియమాలు పాటిస్తే ఏ రోగం మన దరి చేరదని ఈ సందర్భంగా పుట్ట వినయ్ కుమార్  పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాజీ వైస్ చైర్మన్ నంద కుమార్ యాదవ్, రాష్ట్ర దళిత మోర్చ అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, డివిజన్ అధ్యక్ష్యులు రాజు శెట్టి కురుమ, బీజేవైఎం నాయకులు నీరాటి చంద్ర మోహన్, ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డి ప్రసాద్, సత్య కుర్మ, ఉపాధ్యక్షులు బాలరాజు, కార్యదర్శి సుర్ణ రాజు, భీమాని విజయ లక్ష్మి, భీమాని సత్య నారాయణ, ఎళ్లేష్ కురుమ, అరుణ కుమారి, అందికేరి మహేష్, గజ్జల శ్రీనివాస్, పీట్ల బసంత్, పీట్ల  జగదీష్, సాయి వెంకట్ గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు.