ఉపాధ్యాయ మిత్రునికి సన్మానం
Published: Tuesday September 28, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో సోమవారం శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాల వలిగొండలో చదువుకున్నా 1995-96 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన మా చిన్న నాటి మిత్రులు ఆలకుంట శ్రీనివాస్ గత 20 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ, ప్రస్తుతం సుంకిశాల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం 2021 ఉపాధ్యాయ దినోత్సవ సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా మా మిత్రుడు ఎన్నికైనందున అతనితో ఉన్న అనుబంధాన్ని,గత అనుభూతులను పంచుకుని సంతోషంగా శాలువా, పూలమాలతో సన్మానించనైనది. అనంతరం తనతో చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్న మిత్రులు విచ్చేసి ఇలా సన్మానం చేసినందుకు మిత్రుల అభిమానానికి ఆలకుంట శ్రీనివాస్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మా బ్యాచ్ కు సంబంధిన మిత్రులు వలిగొండ గ్రామ ఉప సర్పంచ్ మైసోల్ల మచ్చగిరి,కొంపల్లి విజయకుమార్,ఎక్కలదేవి మల్లేశం,యార శ్రీశైలం,బొడ్డుపల్లీ కృష్ణ, బుంగమట్ల సుధాకర్, బండి రమేష్,మల్గ నాగులు,ఏమ్మే రమేష్,మల్గ బీరప్ప,మంగ శ్రీను,శర్వా చారీ,చెరుకు అంజయ్య,పలుసం వెంకటేష్,బొడిగే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: