టి ఆర్ నగర్ లో బస్తీ దవాఖాన ను ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి

Published: Monday August 29, 2022

జగిత్యాల, ఆగస్టు 28 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ టి ఆర్ నగర్ లో బస్తీ దవాఖాన ను ప్రారంభించి అనంతరం వార్డుకు చెందిన 99 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ లు, ముగ్గురు ఆడబిడ్డలకు షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ అందజేసినారు. ఆనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి అల్పాహారం చేసిననారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ చాంద్ పాషా, డిఎంహెచ్ఓ శ్రీదర్, కమిషనర్ స్వరూప రాణి, డి ఈ రాజేశ్వర్, కౌన్సిలర్ లు, నాయకులు, వైద్య అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.