ఆదర్శ జానపద సాంస్కృతిక కళా సంస్థ 20వ వార్షికోత్సవ ఉత్సవాలు
Published: Monday June 13, 2022
జన్నారం రూరల్, జున్ 12, ప్రజాపాలన: ఈ నెల ఇరువై అరు తేది న రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలో నిర్వహించనున్నట్లు ఆదర్శ జానపద సాంస్కృతిక కళా సంస్థ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి రాజలింగం తెలిపారు., అదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ కళాప్రదర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళారూపాలలో నిష్ణాతులైన కళాకారులను నాటి రాజకీయ సినీ రంగ ప్రముఖులచే బహుమతులను సత్కరించడం జరుగుతుందని తెలిపారు., అదర్శ జానపద సాంస్కృతిక నిర్వహణ కళావైబవాన్ని చూడడానికి అనేకమంది రాష్ట్ర ప్రముఖులు పాల్గొననున్నారని అన్నారు. ఇందులో , గుస్సాడీ, దిమ్మిశా, కోలాటం, జానపద గీతాలు, యక్షగానం, తదితర కళాబృందాలు, ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ జిల్లా సమైక్య వై. ఉమామహే శ్వరరావు, వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రామ్ ప్రకాష్, కళా బంధువులు మిక్కిలినేని రాజశేఖర్ కళాకారులు తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: