సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

Published: Wednesday August 11, 2021
పరిగి 10 ఆగస్టు ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పూడూర్, పరిగి, దోమ, గండీడ్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది అనారోగ్యంతో ఇటీవలె ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి మరియు వారితోపాటు గండీడ్ మండల పరిధిలోని దేశాయిపల్లి గ్రామానికి చెందిన శివలీల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుట కోసం ఎల్వోసీ ద్వారా రూ 7 లక్షలు మరియు పూడూర్ మండల పరిధిలోని కంకల్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య కు రూ 79 వేల రూపాయలు మరియు కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన అభయ్ రామ్ కు రూ 80 వేల ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా మొత్తం 14 మంది లబ్ధిదారులకు కలిపి రూ 14.97 లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్వగృహం ఆవరణలో లబ్ధిదారులకు మంజూరు చెహించి ఇవ్వటం జరిగింది.