4వ వార్డులో మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం
Published: Wednesday June 16, 2021
మధిర ప్రజా ప్రతినిధి 15వ తేదీశ్రీయుత జిల్లా కలెక్టరు గారి ఆదేశాలు అనుసారం ఈరోజు మధిర మున్సిపాలిటీ లో 4వ వార్డు నందు మునిసిపల్ కమిషనర్ A.రమాదేవి మరియు చైర్ పర్సన్ మొండితోకలత, వార్డు 13వార్డ్ కౌన్సిలర్ బిక్కిఅనిత గారి ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా మాట్లాడుతూ రానున్న వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలనీ తెలిపినారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వాసిరెడ్డి ప్రసాద్ గారు, ఆశ వర్కర్ శ్రీదేవి, ఆర్ పీ చంటి, వార్డు ఇన్చార్జి బాబు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: