అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్, మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ.శ్రావణి

Published: Friday December 24, 2021

జగిత్యాల, డిసెంబర్, 23 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ 44వ వార్డ్ ఖాజీపురాలో 5లక్షలతో సీసీ డ్రైనేజి మరియు సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మరియు మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ.శ్రావణి ప్రవీణ్ భూమి పూజ చేసినారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్వరూప రాణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద రావ్, ఎఎంసి వైస్ చైర్మన్ మొసిన్, కో.అప్షన్ రియాజ్ మామా, పట్టణ ఉపాధ్యక్షుడు దుమల రాజ్ కుమార్, నాయకులు సాగర్ రావ్, సుల్తానీ అహ్మద్, ఫరూక్, అమీన్, ఇతేమ్మధ్, డి.ఈ రాజేశ్వర్ రావు, ఏ.ఈ శరణ్ తేజ, 44వ వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.