సురభి వాణిదేవిని గెలిపించుకుందాం

Published: Saturday March 13, 2021
- డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు

 

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి :  హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం తరపున , ఎన్నికల బరిలో ఉన్న తెరాస పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవిని గెలిపించుకుని, బిసిల నిబధ్ధతను చాటుకుందామని రాష్ట్ర బిసి కమిషన్ పూర్వ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు,  డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. బ్రాహ్మణ సమాజంకు చెందిన సురభి వాణికి ఎందుకు మద్దతు తెలపాలని ప్రశ్నించేవారికి సమాధానంగా స్వర్గీయ ప్రధాన మంత్రి పివీ నరసింహారావు బిసిలకు చేసిన సేవ ఎనలేనిదని ఆయన గుర్తు చేశారు. బిసిల ఆత్మగౌరవం పెంచి, సముచిత గౌరవం కల్పిస్తున్న తెరాస కు అండగా నిలబడి, ఈ ఎన్నికలలో వాణిదేవి గెలుపుకు అందరు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సురభి వాణికి మద్దతుగా, జాతీయ బిసి అధ్యయన వేదిక, రాష్ట్ర బిసి కులసంఘాల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో బిసి అధ్యయన వేదిక అధ్యక్షులు డివీ కృష్ణారావు అధ్యక్షతన శుక్రవారం బిసి కుల సంఘాల ప్రతినిధుల సమావేశం  చందానగర్ లో నిర్వహించారు. అనంతరం కృష్ణారావు సమావేశంలో తీర్మానాలను ప్రవేశపెట్టి ,ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు.సురభి వాణి గెలుపుకు తమ జిల్లా కమిటీలు తమదైన పద్దతిలో కృషి చేయాలని, రివ్యూ ఋణం తీర్చుకుందామన్నారు. సమావేశంలో జాతీయ బీసీ అధ్యయన వేదిక ప్రతినిధులు  బి. విజయ్ కుమార్, మోటూరి నారాయణ రావు, వేంకట నారాయణ, పోసిన నాగరాజు, రాం మాధవ్, సాయి ధర్మాన, సత్యలక్ష్మీ, వాసుదేవ్ నేత, శివప్రసాద్, లింగంగౌడ్, కృష్ణమూర్తి, రఘు యాదవ్, గాదె సమ్మయ్య, వైద్య వెంకటేశ్వర్లు, సమ్మయ్య ముదిరాజ్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.