అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

Published: Monday April 11, 2022
మధిర ఏప్రిల్ 10 ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలోని లడక్ బజార్లో ఆదివారం దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అభిజిత్ లగ్నంలో నిర్వహించిన కళ్యాణ కార్యక్రమంలో ఆరిగే శ్రీనివాసరావు రజిని దంపతులు వలిశెట్టి శ్రీనివాసరావు ఆదిలక్ష్మి దంపతులు పీటల మీద కూర్చుని శాస్త్రోక్తంగా కళ్యాణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు కళ్యాణాన్ని అర్చకులు అప్పిలి శ్యామ్ సుందర్ శర్మ అప్పిలి అవినాష్ శర్మ చేతుల మీదగా నిర్వహించారు స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో మహిళ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి తన్మయత్వం చెందారు ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ మొండితోక నాగరాణి సుధాకర్ దంపతులు దేశభక్త యువజన సంఘం నిర్వాహకులు చెరుపల్లి శ్రీధర్ గుంటూరు రమణారావు మళ్ల రాజు కనకాచారి చక్రవర్తుల వరద రాజన్ ధూళిపాల దినేష్ రమాదేవి హేమమాలిని శారద తదితరులు పాల్గొన్నారు