ఎర్రుపాలెం మండలంలో పర్యటించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Wednesday December 29, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండల కేంద్రంలో గల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సిఫారసుతో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో మంజూరైన 2,60,000/- లక్షల రూపాయల విలువ చేసే 6 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నరసింహ పురం గ్రామంలో పర్యటించి గ్రామంలో జరుగుతున్నటువంటి శీలం వెంకట రామిరెడ్డి కుమారుని వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం గంతాల శ్రీనివాసరావు అనారోగ్యంతో ఉండడంతో వారిని పరామర్శించారు. అనంతరం ఎరమల జనార్దన్ రెడ్డి నాయనమ్మ ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కొత్తపల్లి జ్యోతి గారికి 60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. అనంతరం కొత్తపల్లి అలివేలు అనారోగ్యంతో ఉండడంతో వారినీ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు హాజరయ్యారు.