ఎంపీపీ, ఎమ్మెల్యే డ్రైవర్ పై, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి

Published: Wednesday May 11, 2022
సీఐకి ఫిర్యాదు చేసిన భాజపా నేతలు
బెల్లంపల్లి మే 10 ప్రజా పాలన ప్రతినిధి: తాండూర్ మండలం రేచిని గ్రామ పంచాయతీలోని బారేపల్లిలో నిన్న అధికారిక కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను, గ్రామస్తులు తమ సమస్యల పై ప్రశ్నిస్తూ ఉండగా, సెల్ ఫోన్లలో ఆ నిరసనను చిత్రీకరిస్తున్న తమపై ఎమ్మెల్యే డ్రైవర్ కృష్ణ, తాండూర్ మండలం ఎంపీపీ ప్రణయ్,లు దౌర్జన్యం చేసి బెదిరిస్తూ  మా ఫోన్లు లాక్కుని, ప్రాథమిక హక్కులకు భంగం కలిపించారని ఆరోపిస్తో, తాండూర్ ఎంపీపీ ప్రణయ్ పై మరియు ఎమ్మెల్యే కార్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని తాండూర్ సిఐకి బుధ వారం ఫిర్యాదు చేశామని బాధితులు తాళ్లపెల్లి భాస్కర్ గౌడ్, ఆడే సాయి కిరణ్ తెలిపారు. సిఐ కి ఫిర్యాదు చేసిన వారిలో బాధితులతో పాటు, బీజేపీ మండల అధ్యక్షులు రామగౌని మహీధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఆనంద్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ప్రదీప్, అసెంబ్లీ నాయకులు శ్రీకృష్ణ దేవరాయలు, శంకర్, తదితరులు ఉన్నారు.