*వీర హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేయండి * * విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బోజిరెడ్డి*
చేవెళ్ల ఏప్రిల్ 4, (ప్రజాపాలన):-
చేవెళ్ల మండల కేంద్రంలోనిహనుమాన్ మందిర్ ఆలయం వద్ద మంగళవారం వీర హనుమాన్ శోభ యాత్ర సమావేశం బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
చైత్ర పౌర్ణమి గురువారం 6 వ తేది నాడు, విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయాత్ర ను విజయవంతం చేయాలని సమావేశం ఏర్పాటు చేయగా,,ఈ సందర్భంగా చేగోరి భోజిరెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల గ్రామంలోని హనుమాన్ ఆలయం నుండి గుండం దగ్గర ఉన్న హనుమాన్ మందిర్ వరకు శోభయాత్ర కార్యక్రమం ఉంటుందిదన్నారు. కార్యక్రమంలో రామ భక్తులు అందరూ హాజరై విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చేగురి బోజిరెడ్డి బజరంగ్దళ్ చేవెళ్ల మండల్ ప్రముఖ ధనుష్ రెడ్డి, చేగురి ప్రవీణ్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సాయిరాం, సందీప్ గౌడ్ ,సాయి , త్రినేత్ర, ఆనంద్, జయసింహ, నగరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: